మీకు అర్థమవుతుందా..! : ఆ దేవుడే నన్ను పంపించాడు : ప్రధాని మోదీ

మీకు అర్థమవుతుందా..! : ఆ దేవుడే నన్ను పంపించాడు : ప్రధాని మోదీ

సేవ చేయటం కోసం ప్రత్యేక ఉద్దేశంతో ఆ దేవుడే నన్ను పంపించాడని ప్రధాని మోదీ అన్నారు. సర్వ శక్తిమంతుడు అయిన ఆ దేవుడు.. ప్రజలకు సేవ చేయటం కోసం నన్ను పంపించాడు.. లేకపోతే నాకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తుందన్నారు ప్రధాని మోదీ. నా దృఢ సంకల్పానికి మూలం దేవుడు ఇచ్చిన బహుమానం కావొచ్చు.. తనను ఓ లక్ష్యంతో పంపి ఉండొచ్చు అన్నారు ప్రధాని మోదీ. ఓ ఇంటర్వ్యూలో మోదీ తన దైవారాధన గురించి మాట్లాడారు.

నాకు ఇద్దరు దేవుళ్లు.. ఒకరు కనిపించని సర్వశక్తిమంతుడు అయిన భగవంతుడు.. మరొకరు ప్రజలు. ఈ ప్రజలకు సేవ చేయటానికి నాకు ఇంత శక్తి ఆ దేవుడు ఇస్తే.. నిరంతరం లక్ష్యం కోసం పని చేయటానికి ఈ ప్రజలే నాకు శక్తినిస్తున్నారని అభిప్రాయపడ్డారు మోదీ. జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ.

కఠినమైన సమయాల్లో ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ఇంటర్వ్యూలో మోదీని ప్రశ్నించగా.. తాను ఏం చేసిన దైవిక స్ఫూర్తితోనే చేస్తానని ఆయన అన్నారు. మీరు ఆశ్చర్య పోయినట్లుగానే తాను కూడా అప్పుడప్పుడు ఈ పని నేను ఏలా చేయగలిగానని ఆశ్చర్యపోతానని మోదీ అన్నారు.  తన వెనుక దేవుడి ఉండి కఠినమైన సమయాల్లో నిర్ణయాలు తీసుకునే శక్తి ప్రసాదిస్తాడని ప్రధాని వివరించాడు. తాను కఠినమైన నిర్ణయాలు తీసుకోనని, సరైన నిర్ణయాలే తీసుకుంటానని ఇంటర్య్వూలో చెప్పారు.

తన దృడ సంకల్పం దేవుడిచ్చిన గిఫ్ట్ అని అన్నారు. ఏలాంటి రాజకీయ నేపథ్యంలోని పేద కుటుంబంలో పుట్టి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిని కావడం ఏంటని.. నిజంగా వితంగా అనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. తన తల్లి చదువుకోలేదని, రాజకీయ నేపథ్యం కూడా లేదని అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు తనను ప్రజలకు సేవచేయడానికే పుట్టించాడని మోదీ వివరించాడు. 140 కోట్ల దేవుళ్లను ఆయన పూజిస్తానని ఇంటర్వ్యూలో అన్నారు. వారే నాకు ఇంత శక్తిని ప్రసాదిస్తారని ప్రధాని చెప్పుకొచ్చారు.